Namaste NRI

భారత్ తొలి అంతరిక్ష యాత్రికుడిగా సంతోష్ జార్జ్

అంతరిక్షంలోకి ప్రయాణించే భారతీయ తొలి రోదసి యాత్రకుడిగా కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్‌ జార్జ్‌ కులంగర చర్రిత సృష్టించబోతున్నారు. అమెరికాలోని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు. ఇటీవలే వర్జిన్‌ గెలాక్టిక్‌ కు చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సన్‌ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శీరిష్‌ పాటు పలువురు దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో.. ఈ తరహా యాత్రలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తొలి యాత్ర విజయవంతం కావడంతో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ మరిన్ని యాత్రలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లేందుకు సంతోష్‌ జార్జ్‌ సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర కోసం ఆయన రూ.1.8 కోట్లు (2.5 లక్షల డాలర్లు) ఖర్చు చేయనున్నారు.. దీంతో, రోదసీ యాత్ర చేసిన తొలి భారత పర్యటకుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events