Skip to main content

Namaste NRI

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన సికింద్రాబాద్ గణేష్ దేవాలయ కమిటీ

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ కమిషనర్, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు.ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు శాసనసభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News