Namaste NRI

బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ సంచలన ప్రకటన చేశారు. ఆఫ్గానిస్థాన్‌ సంక్షోభానికి ఓ పరిష్కారం చూపడం కోసం అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆ మేరకు రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతామన్నారు. తాలిబన్లతో కలిసి పనిచేసే అవకాశం ఉందని  ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం అప్గాన్‌ సంక్షోభం పరిష్కారం కోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా అఫ్గాన్‌ పౌరులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచారు. కొన్ని సమస్యల వల్లే బ్రిటన్‌ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఓవైపు తాలిబన్ల పాలనను గుర్తించేందుకు అనేక దేశాలు వెనుకాడుతుంటే బోరిస్‌ మాత్రం వారితో కలిసి పనిచేస్తాననడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events