Namaste NRI

శంషాబాద్ టూ శ్రీనగర్ విమాన సర్వీసులు ప్రారంభం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఉదయం 6:15 గంటలకు 88 మందితో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీనగర్‌కు బయల్దేరి వెళ్లింది. ఈ సర్వీసులు ప్రతీ సోమ,  బుధ, శుక్ర, శనివారాలు నడుస్తాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కొవిడ్‌ రెండో దశ ముగిసిన తర్వాత విమానయాన రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, జాతీయ విమాన సర్వీసుల్లో 90 శాతం మేర ప్రారంభమయ్యాయని వారు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events