Namaste NRI

ఇండస్ట్రీని ఆదుకోండి.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చిరంజీవి విజ్ఞప్తి

కరోనా వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని మెగాస్టార్‌ చిరంజీ అన్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్‌ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు  మెగాస్టార్‌ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవాలని అన్నారు.   గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ రేట్‌ బాగా పడిపోయిందని అన్నారు. ఏవో కొన్ని సినిమాలు ఆడితే ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉందని అనుకోరాదని పేర్కొన్నారు. ఇక్కడ కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే గానీ ఢొక్కాడనివాళ్లు ప్రత్యక్షంగా వేలమంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారని వెల్లడిరచారు.  ఐదారుగురు హీరోలే, ఐదారుగురు నిర్మాతలో, ఐదారుగురు దర్శకులో బాగున్నంత మాత్రాన సినిమా పరిశ్రమల మొత్తం బాగుందని కాదన్నారు.

                కరోనా సమయంలో షూటింగ్‌లు నాలుగైదు నెలలు ఆగిపోయే సరికి చిత్ర పరిశ్రమ దుస్థితి సుస్పష్టమైంది. విరాళాలతో కార్మికులను ఆదుకోగలిగాం.  మరోవైపు సినిమా ఉత్పాదాక వ్యయం పెరిగిపోయింది. బడ్జెట్లు పెరుగుతున్నాయి కానీ ఆదాయాలు మాత్రం రావడం లేదు. దీనిపై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అర్థిస్తున్నాం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రత్యేకంగా ఆర్థిస్తున్నాను. అగ్రహీరోలను దృష్టిలో ఉంచుకుని మిగతా అందరూ బాధపడేలా దయచేసి నిర్ణయాలు తీసుకోవద్దు. సభాముఖంగా మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events