అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలు పార్టీ వేదికపై కత్తులు దూసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో విదేశీ విధానాలు అనే అంశంపై నిర్వహించిన ప్రైమరీ డిబేట్ వాడీవేడిగా సాగింది. ఒక దశలో సహనాన్ని కోల్పోయిన ఇద్దరూ పెద్దగా అరుచుకున్నారు. పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ ప్రాథమిక చర్చలో భారతీయ మూలా లున్న ఇద్దరు వ్యక్తులు ఒకే వేదికను పంచు కోవడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం.














