అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఎదురుగాలి వీస్తున్నది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తారని తాజా సర్వే అంచనా వేసింది. అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరన జరుగను న్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, రిపబ్లికన్స్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తలపడనున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల్లో గెలిచేది ఎవరు అన్న అంచనాల్లో సర్వే సంస్థలు నిమగన్నమయ్యాయి. తాజాగా ఓ కీలక సంస్థ ఓపినీయన్ పోల్ నిర్వహించింది. కీలక రాష్ట్రాల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కన్నా వెనుకనపడ్డాడు. ఏడు రాష్ట్రాల్లో ఓపీనియన్ పోల్ నిర్వహించగా, ఆరు రాష్ట్రాల్లో ట్రంప్కే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై కొన్ని అంశాల్లో అమెరికన్లు అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ఏడు రాష్ట్రాల్లో, ఆరు రాస్ట్రాల్లో ట్రంప్కు 6 నుంచి 8 శాతం బైడెన్ కన్నా ఆధిక్యం ఉన్నట్లు తేలింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెడవా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు.
పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెడవా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాలో అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేస్తాయి. విజేతను నిర్ణయిస్తాయి. ఈ సర్వేలో ఒక్క విస్కాన్సిన్లో మాత్రమే బైడెన్ ట్రంప్కన్నా ముందు ఉన్నారు. మిగతా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడు.
