Namaste NRI

భారత విమానాలపై యూఏఈ నిషేధం

భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సంస్థ అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో కరోనా డెల్టా వేరియంట్‌ ఉధృతి కారణంగా గత నెల కెనడా ప్రభుత్వం సైతం భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై మరో నెలపాటు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events