Skip to main content

Namaste NRI

వరుణ్‌ తేజ్‌ మట్కా షూటింగ్ షురూ

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం మట్కా. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు.   కరుణకుమార్‌ దర్శకత్వం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయేందర్‌ రెడ్డి తీగల, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.  ఈ  చిత్రంలో నవీన్‌చంద్ర, కిషోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ  చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. యావత్‌ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 1958-1962 కాలం మధ్యలో కథ నడుస్తుంది. వరుణ్‌తేజ్‌ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 50, 80ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్‌ చేశాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్‌ కుమార్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events