జయ కుమార్, శీను, స్వీటీ-, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమ కథా చిత్రం మదిలో మది. నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్కు తాగుబోతు రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై అసిస్టెంట్గా పని చేశాడు. నాకు డ్రైవర్గా ఉండేవాడు. అప్పటి నుంచి ఫైర్ ఉండేది. కొంచెం పెద్ద వాళ్లని కలిసి సినిమాను ప్రమోట్ చేయమని చెప్పాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్, బేబి డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ప్రమోషన్ చేయించాడు. నేను ఈ రోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చాను. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు. డైరెక్టర్ ప్రకాష్ ఈ సినిమాను బాగా తీశాడు. క్రాంతి కెమెరావర్క్ బాగుంది. సినిమాలో ట్విస్టులు బాగుంటాయి. ఈ సినిమాకు మీడియా సహకారం అందించాలి. నిర్మాతకు విజయం చేకూరాల ని కోరారు.
దర్శకుడు ప్రకాష్ పల్ల మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీం అంతా రాత్రిపగలూ కష్టపడ్డాం. క్రాంతి నీలా ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. డీఐ, సౌండింగ్ అన్నీ బాగా వచ్చాయి. మా టీంలో అందరూ కష్టపడి కాదు ఇష్టపడి సినిమాను చేశారు. సినిమాను తప్పకుండా చూసి సక్సెస్ చేయండి అని అన్నారు. హీరో జయ కుమార్ మాట్లాడుతూ నేను ఒక డ్రైవర్ని, అసిస్టెంట్ని. ఓ యాక్టింగ్ స్కూల్లో ప్రకాష్ పరిచయం అయ్యాడు. మా ఇద్దరి స్నేహం వల్లే ఈ సినిమాను తీశాం. సినిమా కొత్తగా ఉంటుంది. అన్నారు. హీరోయిన్ సిరి మాట్లాడుతూ మంచి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ చిత్రాన్ని ఇదేనెల 18న విడుదల చేయనున్నారు.