ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ముఖేష్గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం గీతా శంకరం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్లుక్ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించారు. ఈ నెల 14 నుండి సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ముకేశ్ గౌడ మాట్లాడుతూ ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న మొదటి సినిమా ఫస్ట్లుక్ లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది లవ్ అండ్ ఎఫక్షన్తో కూడుకున్న సినిమా. సీరియల్స్లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో, ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. యూత్కు ఈ గీతా శంకరం సినిమా బాగా నచ్చుతుంది అని తెలిపారు.














