రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న క్రైమ్ డ్రామా యానిమల్. సందీప్రెడ్డి వంగా దర్శకుడు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక. భూషణ్కుమార్, ప్రణయ్రెడ్డి వంగా ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రంలో బాబీడియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఈ చిత్రం నుంచి నాన్నా నువ్వు నా ప్రాణం అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. తండ్రీ కొడుకులు రణ్బీర్, అనిల్కపూర్ మధ్య అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ గీతాన్ని సోనూ నిగమ్ ఆలపించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలవుతోంది.














