Namaste NRI

ఆరు నెలల తర్వాత తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం… భారీగా తరలివచ్చిన భక్తులు

ఉత్తరాఖండ్‌లోని చమోలి   జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్‌ ఆలయం  తెరుచుకుంది. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాన్ని చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. భారత సైన్యంలోని గ్రెనేడియర్‌ రెజిమెంట్‌ బ్యాండ్‌ భక్తి గీతాలను ఆలపించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బద్రీ విశాల్ లాల్ కీ జై అంటూ నినాదాలు చేశారు. ఆలయం ఓపెనింగ్‌ సందర్భంగా ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో బద్రినాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు బద్రినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరుచుకున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events