Namaste NRI

జిమ్మీ కార్టర్‌ కు గ్రామీ పురస్కారం

సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కు గ్రామీ పురస్కారం వరించింది.

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ ‌(100) గతేడాది డిసెంబర్‌ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఆయన రచించిన ది లాస్ట్‌ సండేస్‌ ఇన్‌ ప్లేన్స్‌ కు బెస్ట్‌ ఆడియోబుక్‌ నెరేషన్‌ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్‌ కార్టర్‌  అందుకున్నారు. జిమ్మీ కార్టర్‌ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events