ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది.ఇక విదేశీ పర్యటనలో బాగంగా ఈరోజు ఆయన అమెరికా బయల్దేరారు. ఫ్రాన్స్ లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొన్న మోదీ ఇప్పుడు అమెరికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చేరుకోగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ వీడ్కోలు పలికారు.
వాషింగ్టన్ డిసి లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు వివిధ రంగాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/america-300x160.jpg)