Namaste NRI

ప్రధాని మోదీతో తులసీ గబ్బార్డ్‌ భేటీ

అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా గబ్బార్డ్‌కు ప్రధాని మోదీ గంగాజలం అందజేయగా, ప్రధానికి ఆమె రుద్రాక్షమాల బహూకరించారు. అంతకుముందు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో గబ్బార్డ్‌ భేటీ అయ్యారు. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్‌ పన్నూపై చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా ఆమెను కోరారు. రెండు నెలల సమయంలో వీరిద్దరూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించి నప్పుడు తులసితో సమావేశమయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]