
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ఈసారి జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. తానా 24వ ద్వై వార్షిక మహాసభలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తానా కాన్ఫరెన్స్ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు, ఎన్నారై టీడిపి నాయకులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ, గిరి వల్లభనేని, ఎన్నారై గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళతోపాటు ఇతరులు పాల్గొన్నారు.

