Namaste NRI

ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా భేటీ

జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది తొలిసారి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం సుమారు 30 నిమిషాలపాటు కొనసాగినట్లు సమాచారం. పహల్గామ్‌ ఉగ్రదాడి, జమ్ముకశ్మీర్‌లో అనంతర పరిస్థితులపై మోదీ, ఒమర్‌ అబ్దుల్లా చర్చించినట్లు తెలిసింది.

Social Share Spread Message

Latest News