Namaste NRI

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం  

బంగ్లాదేశ్‌లోని మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపితగా బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ పేరును తొలగించింది. ఈ మేరకు ఆ దేశ లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ సంబంధాల మంత్రిత్వ శాఖ ఆర్డినెన్స్‌ జారీచేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు,  పదానికి కొత్త నిర్వచనం ఇస్తూ, ఓ చట్టాన్ని యూనస్‌ ప్రభుత్వం సవరించిందని, జాతిపిత అన్న బిరుదును షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌కు తొలగించింది.

మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగించిన కొద్ది రోజుల్లోనే యూనస్‌ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధానికి యూనస్‌ ప్రభుత్వం కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. బంగబంధు స్వాతంత్య్ర పిలుపు మేరకు యుద్ధం జరిగిందని, బంగ్లాదేశ్‌ విమోచనం పొందిందని ఇంతకుముందున్న చట్టం పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events