Skip to main content

Namaste NRI

మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి  బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో  ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. దేశంలో పెరిగిపోతున్న నియంతృత్వ చీకట్లలో ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగిస్తూ, లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్న ఆమె ధైర్యానికి, శాంతియుత పోరాటానికి ఈ బహుమతి ఒక గుర్తింపు అని నోబెల్ కమిటీ అభివర్ణించింది.

వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరినా మచాడో  చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో సంపన్నమైన, ప్రజాస్వామ్య దేశంగా ఉన్న వెనిజులా, నేడు క్రూరమైన, అధికార దాహంతో నిండిన ప్రభుత్వ పాలనలో తీవ్రమైన మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలోని ఉన్నత వర్గాలు సంపదను పోగేసుకుంటుంటే, మెజారిటీ ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు.

Social Share Spread Message

Latest News