
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ కథానాయిక. సాయి కె.వెన్నం దర్శకత్వం. రాజ్ అల్లాడ, గిరిధర్రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ఎమోషన్స్తో కూడిన మ్యూజికల్ లవ్ డ్రామా ఇదని, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, నీవన్ కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దిలీప్ కె.కుమార్, సంగీతం: కల్యాణ్ నాయక్, నిర్మాణం: పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్.















