ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాకిచ్చింది. తమ దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తాము యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంభిస్తామని అమెరికాకు శ్రీలంక స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే అక్కడి పార్లమెంట్లో దీనిపై ప్రకటన చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు ఆఫ్రికాలోని డిబౌటి పట్టణంలో ఉన్నాయి.

ఈ విమానాలు ఒక్కో దాంట్లో ఎనిమిది యాంటీ షిప్ మిస్సైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ వాటిని వ్యూహాత్మకంగా వాడేందుకు శ్రీలంకకు తీసుకురావాలనుకుంది. ఇందుకోసం ఆయుధాలతో కూడిన ఈ విమానాల్ని శ్రీలంకలోని మట్టాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తామని, ఇందుకు అనుమతించాలని అమెరికా కోరింది. ఈ నెల ప్రారంభంలో ఈ అంశంపై శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకేతో అమెరికాకు చెందిన సౌత్, సెంట్రల్ ఆసియా ప్రతినిధి సెర్గియో గోర్ చర్చలు జరిపారు. ఈ నెల 4న శ్రీలంకలో విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించాలని కోరారు. కానీ, దీనికి అధ్యక్షుడు దిస్స నాయకే నో చెప్పారు. తాము ఈ యుద్ధ సమయంలో తటస్థంగానే ఉండదలిచామని దిస్సనాయకే తెలిపారు.















