
హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ చమురు పరిశ్రమపై మరిన్ని ఆంక్షలు విధించారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తే ఆ దేశానికి చెందిన నౌకలను తమ తొలి క్షిపణి దాడి సముద్రంలో ముంచేస్తుం దని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాక జలసంధి దిగ్బంధనం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటామని తెలిపింది. ఇదిలావుండగా అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు అవకాశం కల్పించి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య యత్నాలు కొనసాగుతున్నాయి.















