దినేష్తేజ్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం అలా నిన్ను చేరి. సురేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. ఈ సినిమాలోని కోడిపాయే లచ్చమ్మది అనే గీతాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ తెలంగాణ జానపద గీతాన్ని మంగ్లీ ఆలపించింది. సుభాష్ఆనంద్ స్వరాల్ని సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ పాటలో హెబ్బాపటేల్ నృత్యం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్ర గీతాలన్నింటిని చంద్రబోస్ రచించారు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా, ఐ ఆండ్రూ కెమెరామెన్గా, కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా పని చేశారు.














