Namaste NRI

అమెరికా ప్రతీకార చర్య .. ఐసిస్- కే స్థావరాలపై

కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌`కే జరిపిన వరుస బాంబు పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్‌ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులు చేసింది. నాంగ్‌హార్‌ ప్రావిన్స్‌లో అమెరికా వాయుసేన ఈ మానవ రహిత వాయు దాడులకు దిగింది. తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేధించినట్టు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కెప్టెన్‌ విలియం అర్బన్‌ తెలిపారు.  ఈ దాడుల్లో కాబూల్‌ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం. కాబూల్‌ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతి చెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని స్పష్టం సెంట్రల్‌ కమాండ్‌ కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events