Namaste NRI

చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు… అరుదైన గౌవరం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ ఫెడరేషన్‌ చంద్రయాన్‌-3కి ఇంటర్నేషనల్‌ స్పేస్‌ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయమని పేర్కొంది. అక్టోబర్‌ 14న ఇటలీలోని మిలాన్‌లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డును అందజేయ నున్నది. ఇస్రో చంద్రయాన్‌-3 ల్యాడర్‌ ఆగస్టు 23, 2023న రోజున చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దాంతో అమెరికా, రష్యా, చైనాలతో భారత్‌ చంద్రుడిపై అడుగుపెట్టాయని అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ సమాఖ్య పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events