Skip to main content

Namaste NRI

భార‌త్ జాగృతి ఆస్ట్రేలియా క‌మిటీ ఏర్పాటు

భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ కమిటీని  ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా శ్రీకర్ రెడ్డి అందెం, ఉపాధ్యక్షులుగా తన్వీ గోయల్, అరుణ్ కుమార్ వేణుకంటి, కార్యదర్శిగా అంజనీ సంఖిషీలా, సంయుక్త కార్యదర్శులుగా మన్ ప్రీత్ సింగ్, రామకృష్ణ, కోశాధికారిగా స్వాతి ధనగరి, కల్చరల్ కోఆర్డినేటర్‌గా బాలూ తనాజీ, యూత్ కోఆర్డినేటర్‌గా విరించి యెక్కంటి, స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా అశ్రిత్ కోరబోయినలను నియమించారు.

జాగృతి ఆస్ట్రేలియా కోఆర్డినేటర్లలుగా .. యాక్ట్: మంజుషా బాల్మూరి, క్వీన్ లాండ్ ప్రీతంకృష్ణ, దక్షిణ ఆస్ట్రేలియాకు వెంకట్ లింగంపల్లి, విక్టోరియాకు గౌరవ్ రహీ, పశ్చిమ ఆస్ట్రేలియాకు సతీశ్ వడ్డేపల్లిలను నియమించార‌ని భార‌త్ జాగృతి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంగు న‌వీన్ ఆచారి తెలిపారు.

Social Share Spread Message

Latest News