Namaste NRI

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన

విశాఖపట్నం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్ కు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు కింజరాపు,పెమ్మసాని చంద్రశేఖర్,శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో బాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడి తో మూడు చోట్ల గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది.గూగుల్ ఏఐ డేటా హబ్ తో 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

Social Share Spread Message

Latest News