Skip to main content

Namaste NRI

ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

ఇరాన్‌లో అంతర్గత అల్లర్లు మరియు నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఒక ప్రత్యేక బృందం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత క్షేమంగా తమ గడ్డపై అడుగుపెట్టిన భారతీయులు, విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న తమ కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ గడిపిన ప్రతి క్షణం ప్రాణభయంతో కూడుకున్నదని, మాతృభూమికి చేరుకోవడం పునర్జన్మ వంటిదని వారు భావోద్వేగంతో వెల్లడించారు.

Social Share Spread Message

Latest News