నందమూరిహీరో కల్యాణ్రామ్ కొత్త సినిమా మొదలైంది. సయీ మంజ్రేకర్ కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించనుండటం విశేషం. ప్రదీప్ చిలుకూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా, మురళీమోహన్ కెమెరా స్విచాన్ చేశారు. ముప్పా వెంకయ్యచౌదరి స్క్రిప్ట్ అందించారు. లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయేలా, ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్ప్రసాద్, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.














