Skip to main content

Namaste NRI

ముంబై విమానాశ్రయంలో వింత ఘటన

ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్‌కు ఫ్లైట్‌ సిద్ధమైంది. ఇదే సమయంలో ఓవర్‌ బుక్‌ అయిన అఖిలేశ్‌ చౌబే అనే ప్రయాణికుడు విమానంలో నిలబడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది.. పైలట్‌ను అలర్ట్‌ చేశారు. దీంతో పైలట్‌ విమానాన్ని తిరిగి వెనక్కు మళ్లించాడు. నిలబడ్డ ప్రయాణికుడిని దింపేసిన అనంతరం గంట ఆలస్యంతో విమానం బయలుదేరింది. బుకింగ్‌ విషయంలో చిన్న తప్పిదం జరిగిందని ఇండిగో సంస్థ తెలిపింది.

Social Share Spread Message

Latest News