Namaste NRI

అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌

బోయింగ్‌ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్‌ స్పేస్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.

సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ తాజాగా స్పేస్‌ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్‌ఎస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమన్నారు. బ్యాలెట్‌ కోసం తమ అభ్యర్థనను నాసాకు పంపామని, ఇందుకు నాసా సహకరిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events