Namaste NRI

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ బహ్రెయిన్‌ అధ్యక్షుడు రాధారపు సతీష్‌ కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చిన గొప్ప నాయకుడన్నారు. చావుకు ఎదురెళ్లి పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన యోధుడని ప్రశంసించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News