Namaste NRI

తెలుగు మహిళకు.. ప్రతిష్టాత్మక పురస్కారం

బ్రిటన్‌లో స్థిరపడ్డ హైదరాబాద్‌కు చెందిన క్లాసికల్‌ డ్యాన్సర్‌ రాగసుధ వింజమూరికి అత్యంత ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ సిటిజన్‌ అవార్డు దక్కింది. యూనివర్సిటీలో రాగసుధ ఓ క్లాసికల్‌ డ్యాన్సర్‌ శిక్షకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివిధ కళల్లో సేవలు అందిస్తున్న  వారిని గుర్తించి ఈ అవార్డులను అందజేస్తుంటారు. సమాజంలో విద్య, వైద్యం, వాలంటీరింగ్‌తో పాటు కళల్లో అనుకున్న లక్ష్యాలను సాధించిన వారికి అవార్డు వరిస్తుంది. యూకేలో మొత్తం 26 మంది ఈ అవార్డు రేసులో ఉండగా హైదరాబాద్‌కు చెందిన రాగసుధకు ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. లార్డ్స్‌లోని బ్రిటిష్‌ పార్లమెంట్‌ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు విన్సెంట్‌ ఈ అవార్డును రాగసుధకు అందజేశారు. తన గురువు నుంచి లభించిన విద్యతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్టు రాగ సుధ తెలిపారు. లండన్‌లోని సండర్‌లాండ్‌ వర్సిటీలో అధ్యాపకురాలైన రాగసుధ ప్రవృత్తిరీత్యా నరక్తి. బ్రిటీష్‌ పార్లమెంటులో ఇప్పటికే పలుసార్లు నృత్యప్రదర్వనలు ఇచ్చారు.

Social Share Spread Message

Latest News