ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఇప్పుడు మరో షాక్ తలిగింది. ఉక్రెయిన్లోని రష్యన్ల ఆస్తులను సీజ్ చేశారు. అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించేలా రష్యా వ్యవహరిస్తోందని పలు దేశాలు అరోపిస్తున్నాయి. తాజాగా పుతిన్కు మరో షాక్ తగిలింది. ఈ షాక్ ఇతర దేశాల నుంచి కాకుండా తాను దండెత్తి వచ్చిన ఉక్రెయిన్ నుంచే ఎదురైంది. రష్యా యుద్దోన్మాదం కారణంగా తమ దేశంలోని రష్యన్ల ఆస్తులను సీజ్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఓ సరికొత్త ప్రతిపాదనను తమ దేశ పార్లమెంటు ముందు ఉంచారు. పుతిన్ ఇమేజీని దెబ్బ తీసేదిగా భావిస్తున్న ఈ తరహా చర్యకు జెలెన్ స్కీ చాలా తెలివిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జెల్న్ స్కీ ప్రతిపాదనకు ఉక్రెయిన్ పార్లమెంటు అప్పటికప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఉక్రెయిన్లోని రష్యన్ల ఆస్తుల సీజ్కు సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చేసింది.














