బీబీసీ కార్యాలయాల పై భారతదేశానికి చెందిన ఆస్తిపన్ను అధికారులు దాడులు బ్రిటన్ పార్లమెంట్కు చేరింది. బీబీసీ డాక్యుమెంటరీతోపాటు వారి కార్యాలయాలపై ఐటీ దాడులు చేయడంపై బ్రిటన్ పార్లమెంట్లో చర్చించారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడు జిమ్ షానన్ కోరారు. దీనిపై ప్రధాని రిషి సునాక్ ప్రతినిధిగా ఎంపీ డేవిడ్ రాట్లీ సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం బీబీసీకి అండగా ఉంటుందని చెప్పారు. బ్రిటన్ పార్లమెంట్ బీబీసీకి నిధులు సమకూరుస్తుందని, మేము దాని స్వతంత్రతను గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ ఎంపీలు దిగువ సభలో అత్యవసర ప్రశ్న ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, దాడులపై ఆయన ఏమాత్రం స్పందించలేదు. బ్రిటన్లోని కన్జర్వేటీవ్ పార్టీ, లేబర్ పార్టీలను కూడా బీబీసీ వ్యతిరేకిస్తుండటం విశేషం.














