స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. దివంగత గద్దర్, పల్సర్ బైక్ ఝాన్సీ, ఎపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తదితరులు ముఖ్యపాత్రలను పోషించారు. ట్రైలర్ను దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత సత్యారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాను రూపొందించాను. గద్దర్గారు నాకు తండ్రితో సమానం. ఆయన ఈ రోజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. విశాఖ ఉక్కు ఉద్యమ సమస్యలను తెలియజేస్తూ ఈ సినిమా తీశాం. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తివంతమైన చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పి.సత్యారెడ్డి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)