ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత నెల నుంచి జరుగుతోన్న భీకరపోరుకు కాల్పుల విరమణ రూపంలో తాత్కాలిక విరామం లభించింది. రెండువర్గాల మధ్య సంధి ప్రారంభమైంది. అలాగే హమాస్ చెరలో ఉన్న 24 మంది బందీలు విడుదలయ్యారు. దీనిపై జో బైడెన్ స్పందించారు. ఇది ప్రారంభం. త్వరలో యుఎస్ పౌరులంతా విడుదలవుతారు అని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య సంధిని పొడిగించే అవకాశాలు వాస్తవికమైనవి అని స్పష్టం చేశారు. బందీలుగా ఉన్న యుఎస్ పౌరులు త్వరలో విడుదల చేయబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.














