Namaste NRI

అభిమానులకు కేసీఆర్‌ విజ్ఞప్తి …నేనే వస్తా.. ఎవ్కరూ రావద్దు

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు పరామ‌ర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  వారుసైతం యశోద హాస్పటల్‌కు వెల్లువలా తరలి వస్తున్నారు. తమ నేతను చూసేందుకు గంటల తరబడి అక్కడే నిరీక్షిస్తున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా రావటం వల్ల తనతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలుగుతోందని, ఎవ్వరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తన వల్ల ఇతర రోగులు ఇబ్బందులు పడకూడదన్నారు. ఇన్ ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారని కాబ‌ట్టి ఎవ్వరు ఆస్పత్రికి రావద్దని కోరారు. తాను త్వరలోనే కోరుకుని ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events