హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లు ఇద్దరూ కూడా ఒక భారీ పాన్ ఇండియా మూవీ కోసం కలిసి వర్క్ చేయనున్నారు. శనేయిల్ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మేజర్ చిత్రం తర్వాత హీరో అడివి శేష్ మరోసారి హిందీ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.














