మిస్ టీన్ వాషింగ్టన్-2023 టైటిల్ ను తెలుగు అమ్మాయి గడ్డం శ్రియ గెలుచుకుంది. వాషింగ్టన్ లో జరిగిన పదకొండో ప్రపంచ మహిళా ఉత్సవాల్లో మిస్ టీన్ ఇండియా ఫిలాంత్రపీ యూనివర్శ్ 2023 పోటీల్లో శ్రియ విజేతగా నిలించింది. ఆమె రెడ్మండ్ లోని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. శ్రియ పలు షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ లో నూ నటించింది.
శ్వేత, విజయ్ గడ్డం కుమార్తె శ్రియ గడ్డం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూల్ కిర్క్ల్యాండ్ లో 8వ తరగతి చదువుతూ, నృత్యం, నటన, మోడలింగ్, సంగీతం పట్ల శ్రియకు మక్కువతో 5సంవత్సరాల వయస్సులోనే కళారంగాల్లో రాణించడం సంతోషదాయకమన్నారు. పోటీల్లో పాల్గొని మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ 2023, మిస్ టీన్ ఇండియా ఫిలాంత్రోపీ యూనివర్స్ 2023 అనే రెండు టైటిళ్లను గెలుచుకున్నారు. తెలుగు అమ్మాయి రెండు టైటిళ్లను గెలుచుకోవడం అభినందనీయమన్నారు.














