Skip to main content

Namaste NRI

న్యూయార్క్‌ లో జాతిపిత నూతన విగ్రహావిష్కరణ

జాతిపిత మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్‌నగరంలో  ఆవిష్కరించారు. శ్రీ తులసీ మందిర్‌ వెలుపల నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని సిటీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌, న్యూయార్క్‌ చట్టసభ సభ్యురాలు జెన్నీఫర్‌ రాజ్‌కుమార్‌ ఆవిష్కరించారు. కాగా, సౌత్‌ రిచ్‌మండ్స్‌ హిల్స్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్ని 2022 ఆగస్టులో దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాల ని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే గాంధీ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి తాజాగా ఆవిష్కరిం చినట్లు మేయర్‌ ఎరిక్‌ తెలిపారు. తమ నగరంలో ద్వేషానికి తావు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News