Namaste NRI

18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో .. మళ్లీ జత కట్టిన ఆ స్టార్ హీరోయిన్

18ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన స్టాలిన్‌ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. వీరిద్దరి కలయికకు విశ్వంభర వేదికైంది. వశిష్ఠ దర్శకత్వం. ఈ చిత్రంలో త్రిషను రంగంలోకి దింపేశారు దర్శకుడు వశిష్ఠ. యూవీ క్రియేషన్స్‌తోపాటు చిరంజీవి కుమార్తె సుస్మిత సొంత నిర్మాణ సంస్థ గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. చిరంజీవి కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అడ్వంచరస్‌ సోషియోఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీటికి తోడు త్రిష కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events