
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్రణబాలి. 19వ శతాబ్దంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బర్త్డే స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జయమ్మగా రష్మిక మారిన పరిణామక్రమాన్ని చూపించారు. రణబాలి బలం జయమ్మ అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. ఇటీవలే ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్ని పూర్తి చేసుకున్న విషయం విదితమే. ఈ ఏడాది సెప్టెంబర్ 11న గ్రాండ్గా సినిమా విడుదల కానున్నది.















