Namaste NRI

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని సైప్రస్‌ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని అకడి ప్రభుత్వం సత్కరించింది. సైప్రస్‌ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ మకారియోస్‌ ని ప్రధాని అందుకున్నారు. ఈ అవార్డుతో తనను సత్కరించినందుకు సైప్రస్ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.

ఆ దేశ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌  ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్‌ వెళ్లారు. జూన్‌ 15, 16 తేదీల్లో ప్రధాని అక్కడ పర్యటించనున్నారు. కాగా గడిచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్‌ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events