Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనకు … జి-7 సానుకూలం!

రష్యన్‌ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై భారీగా టారిఫ్‌లను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనకు ఐరోపా సమాఖ్యతో పాటు, జి 7 దేశాలు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణ చేయాలని, అందుకోసం రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గం అని అందులో భాగంగా రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై భారీ టారిఫ్‌లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో జి 7 దేశాలు సమావేశమయ్యాయి. ఈ భేటీలో సుంకాల విధింపుపై చర్చ సాగింది.

ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌ మాట్లాడుతూ  ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి జీ 7 దేశాలు ముందుకురావాలని కోరారు. అందుకు జి 7 దేశాలు స్పందిస్తూ  యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. రష్యాపై ఒత్తిడి తేవడానికి ఇంతకుముందు ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల ముందు కూడా ట్రంప్‌ ఇలాంటి ప్రతిపాదనలే చేశారు. అయితే, ఈ విషయంలో ఈయూ దేశాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. దీంతో అది సాధ్యపడలేదు. ఇవే ప్రతిపాదనలను ఆయన మళ్లీ జి 7 దేశాల ముందుపెట్టడం గమనార్హం. ఇప్పుడు కూడా టారిఫ్‌ల విధింపుపై ఐరోపా సమాఖ్య దేశాల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా అది ఇంకా సాధ్యపడలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events