రామ్ నితిన్, సంతోష్ శోభన్, నార్నే నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకుడు. ఈ నేపథ్యంలో మ్యాడ్ గ్యాంగ్ను పరిచయం చేస్తూ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. తాను తీసిన జాతిరత్నాలు కంటే ఈ సినిమాలోనే ఎక్కువ వినోదం ఉందని అతిథిగా హాజరైన దర్శకుడు అనుదీప్ అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. ఈ సినిమా మీద అంత నమ్ముకం ఉంది. లాజిక్లు, ట్విస్ట్లు ఏమీ లేకుండా నవ్వడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో కేవలం వినోదం మాత్రమే ఉంటుంది. మ్యాడ్ క్యారెక్టర్స్ పంచే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అన్నారు. అక్టోబర్ 6న విడుదల కానుంది.














